దేశవ్యాప్తంగా బ్యాంకులను టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లాకర్లలోని బంగారం లూటీ చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. వరంగల్ జిల్లా రాయపర్తిలోని SBI బ్రాంచ్లో 19 కేజీలకు పైగా బంగారం లూటీ చేసిన ఆ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొంగిలించిన బంగారంలో కొంత రికవరీ చేసిన పోలీసులు దోపిడీలకు వాడుతున్న టెక్నాలజీని చూసి షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను గుర్తించి దోచేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక …
Read More »సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
చంద్రయాన్ మంగళయాన్ తరువాత ఆదిత్య యాన్ పేరుతో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రయాణించి పరిశోధనలను మొదలుపెట్టింది. తాజాగా యూరప్కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబ్ 3 పేరుతో మూడు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తూ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ప్రయోగం కోసం భారత్ను సాయం కోరింది. రెండు రోజుల క్రితమే ఇస్రో శ్రీహరికోట నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తలపెట్టిన ప్రోబ్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం కూడా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు …
Read More »చలి తీవ్రతతో గజగజ వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. దట్టంగా కమ్మేసిన పొగమంచు!
ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో కనీష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. పొగమంచు, చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందోనన్న …
Read More »Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీటి ద్వారా ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందన్నారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన ఏడు నవోదయ విద్యాలయాలు జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో …
Read More »రాశిఫలాలు 07 డిసెంబర్ 2024:ఈరోజు ధనిష్ట నక్షత్రంలో షష్ రాజయోగం వేళ తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం..!
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం, మీ కుటుంబసభ్యులతో ఏదైనా వివాహం లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అందులో మీ బంధువులలో కొందరిని కలుస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వీటిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు 63 శాతం వరకు …
Read More »ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.. అక్కడ మోస్తరు వర్షాలు
ఏపీకి మరో వర్ష గండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. మరి ఇంతకీ వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఇలా..భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో సుమారు డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. …
Read More »కాంగ్రెస్ ఎంపీ సీటు కింద రూ.500 నోట్ల కట్ట.. విచారణకు ఆదేశించిన రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభలో బయటపడ్డ 500 రూపాయల నోట్ల కట్ట. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ సభ్యుల బెంచ్పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించిన సీటు నంబర్ 222 కింద రూ.500 నోట్ల కట్ట కనిపించింది. అదే సమయంలో …
Read More »Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్ బెస్ట్ స్కీమ్.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!
ఈ పథకం ద్వారా రూ. మహిళలు లేదా బాలికల పేరుతో 2 సంవత్సరాల కాలానికి 2 లక్షలు అందజేస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం పోస్టాఫీసుతో పాటు అనేక బ్యాంకుల్లో..మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఒకటి ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ (MSSC). మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. మహిళలు …
Read More »ఇక బ్యాంకు ఖాతాకు 4 నామినీలు.. లోక్సభలో బిల్లు ఆమోదం!
Nominee: కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఏర్పడిన సమస్యల తర్వాత బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లులో ఈ ప్రధాన మార్పులు చేశారు. ఇప్పుడు ఒక నామినీకి బదులుగా 4 నామినీలు యాడ్ చేసేందుకు అనుమతి ఉంటుంది.. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు డిసెంబర్ 3న లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఒక బ్యాంకు ఖాతాలో 4 నామినీలను జోడించడానికి అందిస్తుంది. కొత్త బ్యాంకింగ్ చట్టం బిల్లులో డిపాజిటర్లకు మెరుగైన రక్షణ, ప్రైవేట్ బ్యాంకుల్లో మెరుగైన సేవలందించే అంశాలు కూడా ఉన్నాయి. క్లెయిమ్ చేయని షేర్లు, …
Read More »అయ్యో దేవుడా.. ఆ తండ్రికి ఎందుకంత శిక్ష వేశావ్..? గుండె తరుక్కుపోయే ఘటన..
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకొని బైక్పై తరలించినహృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కురుపాం మండలం నీలకంఠాపురానికి చెందిన కొండగొర్రి అశోక్, స్వాతిలకు రెండు నెల క్రితం బాబు పుట్టాడు. ఆ బాబుకి రోహిత్ అని పేరు పెట్టారు. అలా మగ బిడ్డ పుట్టాడన్నా ఆనందంలో ఉండగానే అకస్మాత్తుగా రోహిత్కి అనారోగ్య సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే రోహిత్ ఆరోగ్యం మరింత …
Read More »