సంక్రాంతి పండుగ ముందే తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఆ బ్రాండ్ బీర్లు ఇకపై కనిపించవట. రాష్ట్రంలోనే ప్రసిద్ది గాంచిన ఈ బ్రాండ్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ ఏ బ్రాండ్ బీర్లు ఆగిపోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..తెలంగాణలో బీర్ల సరఫరాపై కొత్త మలుపు తిరిగింది. కింగ్ఫిషర్ బీర్ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ లేఖను SEBIకి రాసింది. యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటన ప్రకారం, …
Read More »ఫార్ములా ఈ రేస్ కేసులో టాప్ గేర్లో ఎంక్వైరీ.. విచారణలో సంచలనాలు వెల్లడి!
ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఊపందుకుంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందితులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది.తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీపైనే ఏసీబీ, ఈడీ ఆఫీసులు ఫుల్ …
Read More »ముంబైలో ఆరు నెల పాపకి HMPV పాజిటివ్.. తెలంగాణాలోనూ గత నెలలో 11 కేసులు
Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.దేశంలో …
Read More »అరేయ్.. ఎలారా తినేది.. ఈ పన్నీర్ తింటే.. చివరకు కన్నీరు పెట్టాల్సిందే..
నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే …
Read More »ఇకపై ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్కు చెక్.. నిఘా నీడలోనే ప్రయోగాలు
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ప్రయోగ పరీక్షలు ఉండగా.. బైపీసీ విద్యార్థులకు వీటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే విద్యార్ధులకు ఫుల్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో..ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాలని బోర్డు నిర్ణయించింది. ఈ …
Read More »రైతు భరోసాపై మరింత క్లారిటీ.. ఆ భూములకు కూడా సాయం..!
అన్నదాతలకు రైతుభరోసా పథకంతో పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. జనవరి 26వ గణతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. దీంతో అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గ్రామ సభల్లో రైతుభరోసా లబ్ధిదారులు, సాగు భూముల వివరాలు తెలుసుకోనుంది సర్కార్.జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు.. తెలంగాణలో రైతులందరికీ భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. నిధులు విడుదల చేసేందుకు అంతా రెడీ చేసింది. అయితే రైతు …
Read More »జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?
2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 18, ఏప్రిల్ 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్షకు సంబంధించిన పరీక్ష మాత్రం జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తవగా అడ్మిట్ కార్డులు సైతం విడుదలయాయి. విద్యార్ధుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేదీ …
Read More »అవి అబద్ధమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా.. కవిత సంచలన ఛాలెంజ్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సంచలన ఛాలెంజ్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని ఆరోపించిన కవిత.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఎఎమ్మెల్యే, ఎంపీల తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమితించనున్నారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక …
Read More »యూసుఫ్గూడ బెటాలియన్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
తెలంగాణ పోలీస్ శాఖకు ఏమైందో అర్ధంకాకున్నది. ఈ శాఖలో గత కొంత కాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అధిక మంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూసఫ్ గూడకు చెందిన బెటాలియన్ సిబ్బంది ఒకరు గుండెపోటుతో కుప్పకూలారు. వివరాల్లోకెళ్తే..గత కొంత కాలంగా తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది వరుస ఆత్మహత్యలతో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఆదివారం ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు ఆత్మహత్య …
Read More »