తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది.అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి …
Read More »సీబీఐ కేసులో అరెస్ట్ చేస్తామంటూ వీడియో కాల్.. కట్చేస్తే ఖాతాలోంచి రూ.15 లక్షలు ఉష్ కాకి
ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు.సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాము..మీ దగ్గర హవాలా డబ్బు ఉంది హవాలా వ్యాపారం చేస్తున్నారు..సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు..ఖమ్మం జిల్లా వైరాలో ఓ రిటైర్డు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన బ్యాంకు ఖాతా నుంచి …
Read More »తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత అదే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వేరు దేవత వేరు అని, ఏ తల్లికి కిరీటం ఉండదని స్పష్టిం చేశారు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా? ఈ అంశాన్ని …
Read More »డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర.. డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విభాగంలో రేషన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో “ఒకే …
Read More »గుడ్న్యూస్.. సెట్-టాప్ బాక్స్ లేకుండా ఉచితంగా 500 కంటే ఎక్కువ HD టీవీ ఛానెళ్లు, OTT యాప్స్
Skypro అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్ ప్రొవైడర్. ఇది అనేక ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బీఎస్ఎన్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్..ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు శుభవార్త చెప్పింది. ఎలాంటి కేబుల్ టీవీ అవసరం లేకుండా సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా ఏకంగా 500 కంటే ఎక్కువ హెచ్డీ టీవీ ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది. ఇది దేశంలోని ఎంపిక …
Read More »ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి పొన్నం.. ఎందుకంటే..
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులుతెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కలిశారు. ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. తన ఫాంహౌస్కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ …
Read More »తెలంగాణలో మరోసారి భూకంపం..భయంతో పరుగులు
Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది.తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్నగర్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో …
Read More »పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన యువతి..!
ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ …
Read More »భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయంటే..?
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వైద్య విద్యలో పెద్ద మార్పు వచ్చింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2014కి ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 2014కి ముందు 51,348 సీట్లు ఉంటే ఇప్పుడు 1,18,137కి పెరిగింది. ఇది 130 శాతం పెరుగుదల. ఇప్పుడు 2024లో మెడికల్ కాలేజీల సంఖ్య 780కి పెరిగింది. ఇది 102 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య …
Read More »చౌక.. చౌక.. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్.. అతి తక్కువ ధరకు
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనుంది తెలంగాణ సర్కార్. అది కూడా చౌక ధరకే. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ అందించనున్నారు.ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే …
Read More »