అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన డొనాల్డ్ ట్రంప్.. కమలా హ్యారిస్ కంటే 100 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లీడ్లో ఉన్నారు. కానీ, క్రమంగా పుంజుకున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్.. 200 మార్క్ దాటారు. దీంతో ఇరువురి మధ్య ప్రస్తుతం కేవలం 20 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే, స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో గెలిచి.. మరో ఐదు రాష్ట్రాల్లో …
Read More »కోనసీమ కుర్రోడు, కెనడా అమ్మాయి.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఆ ఊర్లో సందడే, సందడి
తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. అక్కడి అమ్మాయి, అబ్బాయిల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలు దాటింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అబ్బాయి.. కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని …
Read More »బద్దలైన అగ్నిపర్వతం.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. 9 మంది మృతి, భయానక వీడియో
ఇండోనేసియాలో మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలో ఉన్న ఈ అగ్విపర్వతం గురువారం నుంచి రోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని నుంచి లావా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలు కాలిబూడిదవుతున్నాయి. దీని ధాటికి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అగ్నిపర్వతం విస్ఫోటనాలు ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని హెచ్చరించారు. అగ్నిపర్వతం విస్ఫోటనంతో విద్యుత్ సరఫరాకు …
Read More »అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. తమిళనాడు గ్రామంలో సంబరాలు, ఎందుకో తెలుసా?
Kamala Harris: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో ఉండగా.. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 3, 4 రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో కమలా హరిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుండటంతో.. ఎవరు గెలుస్తారనేది అన్ని దేశాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. …
Read More »ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్కు వెళ్లాల్సిన 60 విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు ఎయిర్లైన్ కంపెనీ షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తున్నట్టు వెల్లడించింది. టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్ …
Read More »విమానాలకు బెదిరింపు కాల్స్.. అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టిన పోలీసులు.. వెళ్లి చూస్తే షాక్!
దేశంలోని విమానయాన సంస్థలకు ఈ మధ్య ఓ కొత్త తలనొప్పి మొదలైంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్. మెయిల్స్ విమానయాన సంస్థలను బెదరగొడుతున్నాయి. విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. లేదా ప్రారంభానికి ముందు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉండటంతో.. పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని హుటాహుటిన దారిమళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేసి పరిశీలించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకూ వచ్చినవి అన్నీ ఫేక్ కాల్స్ కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కారణంగా భారీగా నష్టం కూడా …
Read More »తీవ్ర జనాభా సంక్షోభంలో చైనా.. వేలాది స్కూల్స్ మూసివేత
ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్ గార్టెన్లు (Kindergartens) మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో …
Read More »యూట్యూబ్తో డబ్బులే డబ్బులు.. ఈ కొత్త ఫీచర్తో మరింత ఆదాయం.. కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్
గూగుల్కు చెందిన ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్.. మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు మేలు చేకూరుస్తుందని చెప్పొచ్చు. వీరి ఆదాయం పెంచే దిశగా షాపింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని సాయంతో ఇప్పుడు అర్హులైన కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోల్లో ఉత్పత్తుల్ని ట్యాగ్ చేసి ఆదాయం సంపాదించుకోవచ్చని తెలిపింది. సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో యూట్యూబ్.. ఈ అనుబంధ షాపింగ్ ప్రోగ్రామ్ను గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ సేవల్నే మరికొన్ని దేశాలకు విస్తరించింది. దీంతో .. …
Read More »సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయేల్ భీరక దాడులు
ఇజ్రాయేల్ అనుకున్నంత పనిచేసింది. ఈ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్పై ఇజ్రాయేల్ దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 1న ఇజ్రాయేల్పై 200కిపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను …
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …
Read More »