Recent Posts

టీమ్-11తో మంత్రివర్గాన్ని ప్రకటించిన హేమంత్ సోరెన్.. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే..!

జార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. సోరెన్ కేబినెట్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు, RJD నుండి ఒకరు మంత్రి పదవులు పొందారు. జేఎంఎం కోటా నుంచి దీపక్ బిరువా, రాందాస్ సోరెన్, చమ్ర లిండా, యోగేంద్ర మహతో, హఫీజుల్ అన్సారీ, సుదివ్య సోను పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. కాంగ్రెస్ కోటా నుంచి ఇర్ఫాన్ అన్సారీ, దీపికా పాండే, శిల్పి నేహా టిర్కీ, రాధాకృష్ణ కిషోర్‌లకు …

Read More »

ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పాలసీ భేష్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు..

ఇటీవల భారత ఆర్థికాభివృద్ధిని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. తాజాగా పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం రష్యా కీలక పెట్టుబడులకు స్థిరమైన పరిస్థితులను కల్పిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. రష్యన్ ఫెడరేషన్‌లోని అన్ని రంగాలలో, హైటెక్ రంగాలతో సహా, తమ ఉత్పత్తులను విక్రయించడానికి, ఎగుమతి చేయడానికి అవకాశాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి …

Read More »

ప్రతి సంవత్సరం టిక్కెట్లపై రైల్వే ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా.. లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణికులకు మొత్తం రూ.56,993 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి టికెట్‌పై రైల్వే దాదాపు 46 శాతం రాయితీ ఇస్తోందని తెలిపారు. రైల్వే టిక్కెట్లలో తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా, అశ్విని వైష్ణవ్ సభలో మాట్లాడుతూ, భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణీకులకు మొత్తం రూ. 56,993 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రతి టికెట్‌పై 46 …

Read More »