Blog Layout

TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో ఇలా సింపుల్‌గా బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌ ఇదే

TTD Darshan Tickets : తిరుమల (TTD Temple)కు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు అంత ఈజీగా దొరకవు. ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లను ఒకటి రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి. పోనీ.. ఉచిత దర్శనానికి వెళ్దామంటే రోజంతా క్యూ లైన్‌లో ఉండాలి. మరి 300 రూపాయల దర్శనం టికెట్లు లేని వారు.. గంటల పాటు క్యూలైన్‌లో వెయిట్ చేయలేని ఖచ్చితంగా టికెట్లు బుక్‌ చేసుకోవాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏదైనా ఒక టికెట్ ఉండాలి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా, ఆ జీవో కూడా రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్‌ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు …

Read More »

చివరికి పోస్టాఫీస్‌ను కూడా వదల్లేదు కదరా.. 600 పార్శిళ్లు తెరిచి చూసిన పోలీసులు షాక్

Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను పోర్టుల వద్ద, ఎయిర్‌పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. …

Read More »

ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక, ఈ జిల్లాలపై ప్రభావం

ఏపీలో మరోసారి వాన ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈనెల 22నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదంటున్నారు. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ.. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చొని చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత వస్తుందని చెబుతుంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో …

Read More »

ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు.. ఇకపై వారంలో ఆరు రోజులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు చంద్రబాబు. …

Read More »

AP Cabinet: వారం రోజుల గ్యాప్‌లో రెండోసారి భేటీ.. ఈ సారి ఆ నిర్ణయం పక్కా!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 23వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాయం వేదికగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లేఖలు రాశారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని లేఖలో సూచించారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీ ఇటీవలే జరిగింది. …

Read More »

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఈ చిన్న పని చేస్తే చాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నలుగురు ఓటర్లలో ఒకర్ని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు.. దీని కోసం రూ.లక్ష రుసుంగా నిర్ణయించామన్నారు. ఒకవేళ పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అంతేకాదు చనిపోయిన కార్యకర్తల …

Read More »

ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో …

Read More »

అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు పొందొచ్చు.. గూగుల్‌లో కొత్త ఫీచర్‌ వచ్చేసింది.. వివరాలివే!

Flight Tickets : అతి తక్కువ ధరకే విమాన టికెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లకి శుభవార్త. ఇలాంటి వాళ్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫ్లైట్స్లో ఇప్పుడు మీరు తక్కువ ధరతో కూడిన విమాన టికెట్లను సెలక్ట్‌ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.. అతి తక్కువ ధరలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇప్పుడు గూగుల్ మీకోసం కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సూపర్ చీప్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. టెక్ దిగ్గజం గూగుల్‌ మీ టూల్కిట్లో …

Read More »

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం?

Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా …

Read More »