ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఫైల్ కదిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణా కేసుల వివరాలను తనకు పంపాలని సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలు, జిల్లాస్థాయి అధికారులంతా ఉద్యోగులపై నమోదైన కేసులను తక్షణమే సమీక్ష చేయాలని.. పెండింగ్ కేసుల వివరాలతో ఒక నోట్ను తనకు పంపాలంటూ సీఎస్ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ నీరబ్కుమార్ మెమో జారీ చేశారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసులను సంబంధిత శాఖ కానీ, …
Read More »Blog Layout
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …
Read More »ఏపీలో మందుబాబులకు పండగ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ప్రభుత్వం చాలా తక్కువకే!
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్బీసీఎల్కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు కేటాయించింది. నేటి నుంచి మందుబాబులు …
Read More »మహిళలూ బీ రెడీ.. రేపే మంత్రివర్గ సమావేశం.. ఆ శుభవార్త ఖాయం!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీషెడ్యూలులో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల …
Read More »ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్పై ఈసీ సంచలన వ్యాఖ్యలు
Election Commission: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్పై సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. వాటిపైనా సీఈసీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్కు ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ అవి …
Read More »తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు కీలక పదవి.. ఈసారి జాతీయ స్థాయిలో.. ఉత్తర్వులు జారీ..!
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్కు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది ఆ పార్టీ అధిష్ఠానం. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్కు కీలక అవకాశం కల్పించిన అధిష్ఠాటం.. ఇప్పుడు బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టింది. అయితే.. ఇందులో తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన ఎంపీ కె. లక్ష్మణ్ను బీజేపీ జాతీయ …
Read More »ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే పోటీ చేయను.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గత కొంతకాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నాయని.. అలాగే మన దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ఇక హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ …
Read More »Assembly Elections 2024 Date: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
Assembly Elections 2024 Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్ను కూడా వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ – అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలకు …
Read More »దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అడవికి ముప్పు నిజమేనా..?
Vikarabad Navy Radar Station: తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఆందోళన రేకెత్తిస్తుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్కు సమీపంలో ఉన్న దామగుండం ఫారెస్ట్లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. అడవికి ముప్పు వాటిల్లుతుందని.. మూసీ అంతర్ధానం అవుతుందంటూ కొంత మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఆందోళనలు, వ్యతిరేకత వస్తున్న …
Read More »టాటా గ్రూప్ కీలక ప్రకటన.. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. ఈ రంగాలకే ఫుల్ డిమాండ్!
Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal