దిన ఫలాలు (ఆగస్టు 17, 2024): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, …
Read More »Blog Layout
ఆధార్ లేని వారికి అలర్ట్.. ప్రత్యేక క్యాంపులు.. ఎప్పటి నుంచి అంటే?
మనదేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకూ ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకూ అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా …
Read More »రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …
Read More »Bandi Sanjay: కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం.. టీపీసీసీ చీఫ్గా కేటీఆర్, కేసీఆర్కు ఏఐసీసీ, కవితకు రాజ్యసభ ఎంపీ
Bandi Sanjay: కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల్లో.. ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం …
Read More »Mutual Funds: ఇది కదా కావాల్సింది.. గత 3, 5, 10 ఏళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్ రాబడులివే!
Mutual Funds: కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టి మంచి రాబడి రావాలని అందరూ భావిస్తారు. కొందరు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. మరి కొందరు రిస్క్ ఉన్నా హైరిటర్న్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (Mutual fund) పెట్టుబడులు సరైన ఎంపికగా మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై రిస్క్ ఉన్నా.. కొన్నేళ్ల నుంచి హైరిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందులో స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబడులు అందించాయి. ఈ స్కీమ్స్ ఎంచుకున్న వారి డబ్బులను …
Read More »AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …
Read More »నేను పారిపోయే రకం కాదు.. అంత ఖర్మ నాకు లేదు..
తాను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. ఉదయం నుంచి తనపై కొన్ని మీడియా ఛానెళ్లలో, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో తాను పారిపోయేందుకు ప్రయత్నించానంటూ ప్రచారం జరుగుతోందని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. పారిపోవాల్సిన అవసరం, ఖర్మ తనకు పట్టలేదన్నారు. రెండు నెలలుగా విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తాను తప్పుచేశానని …
Read More »India Post GDS Merit List 2024 Live : తపాలశాఖలో 44,228 ఉద్యోగ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..
India Post GDS Merit List 2024 Live : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2024 గత నెలలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 Gramin Dak Sevak పోస్టుల వరకు ఉన్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ …
Read More »పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ …
Read More »TCS: ఏఐతో ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయా? తగ్గుతాయా? భవిష్యత్తు సంగతేంటి? టీసీఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
TCS President V Rajanna: గత కొంత కాలంగా దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు నియామకాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ తగ్గిన నేపథ్యంలోనే కొత్తగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేపట్టకపోగా.. ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయన్న సంగతి తెలిసిందే. భారత దిగ్గజ ఐటీ సంస్థలు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని సంస్థల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా దీనికి ఒక కారణం. మరోవైపు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal