ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. జులై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో పింఛన్ల పంపిణీకై టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్ట్ నెల ఒకటో తేదీనే 99 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99 శాతం మందికి …
Read More »Blog Layout
దుబాయే కాదు భారత్లోనూ టాక్స్ ఫ్రీ స్టేట్..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా.. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. స్టాండర్డ్ డిడక్షన్ పెంచి.. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్లోనూ మార్పులు చేసింది. ఇక దేశంలో ఒక పరిమితి దాటి సంపాదించే డబ్బుపై.. ప్రభుత్వానికి ఇన్కంటాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో.. ఎంత ఆదాయానికి ఎంత పన్ను అని టాక్స్ శ్లాబులు ఉంటాయి. ఆ రేట్లను బట్టి పన్ను చెల్లించాలి. ఎంత ఎక్కువ సంపాదిస్తే కట్టాల్సిన టాక్స్ అలా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే …
Read More »విద్యుత్ కమిషన్ కొత్త ఛైర్మన్గా.. ఏపీ మాజీ ప్రధాన న్యాయమూర్తి..
తెలంగాణలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్కు కొత్త ఛైర్మన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛైర్మన్గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్ను నియమిస్తూ.. మంగళవారం (జులై 30న) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్.. 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. మొదట నియమించిన జస్టిస్ నర్సింహా రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్గా జస్టిస్ మదన్ …
Read More »దశ తిప్పిన ఐపీఓ.. తొలిరోజే 100 శాతం పెరిగిన షేరు.. లిస్టింగ్తోనే చేతికి రూ. 2 లక్షలు!
VVIP Infratech IPO Listing Price: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో మంచి లాభాల్ని అందుకోవచ్చు. మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు నష్టపోతాయో ముందే ఊహించడం కాస్త కష్టమే. అయితే.. మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని షేర్లు అదరగొడుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా ఐపీఓ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చాలా వరకు ఐపీఓలు అద్భుత ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుంటాయి. ఇప్పుడు ఇలాగే ఒక ఐపీఓ ఎంట్రీ …
Read More »ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …
Read More »ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు.. నేటి నుంచే అమలులోకి!
FD Rates: దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించినట్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లను జులై 30వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రత్యేక టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లు పై జనరల్ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత గరిష్ఠంగా 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. మరి ప్రస్తుతం ఈ బ్యాంకులో లేటెస్ట్ …
Read More »మను భాకర్ ఖాతాలో మరో పతకం..
పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …
Read More »జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మల భేటీలో మరో ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్పాండ్లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి …
Read More »హైదరాబాద్లో పంజా విసురుతున్న డెంగీ..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal