Kadam
January 8, 2025 ఎడ్యుకేషన్, తెలంగాణ
142
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ప్రయోగ పరీక్షలు ఉండగా.. బైపీసీ విద్యార్థులకు వీటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే విద్యార్ధులకు ఫుల్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో..ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాలని బోర్డు నిర్ణయించింది. ఈ …
Read More »
Kadam
January 8, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
155
టీటీడీ మాజీ పీఆర్వో నిష్కా బేగం ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. నిష్కా బేగం అనే వ్యక్తి ఎవరూ గతంలో టీటీడీ పీఆర్వోగా పనిచేయలేదని స్పష్టంచేసింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వైసీపీ …
Read More »
Kadam
January 8, 2025 తెలంగాణ, పాలిటిక్స్
143
అన్నదాతలకు రైతుభరోసా పథకంతో పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. జనవరి 26వ గణతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. దీంతో అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గ్రామ సభల్లో రైతుభరోసా లబ్ధిదారులు, సాగు భూముల వివరాలు తెలుసుకోనుంది సర్కార్.జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు.. తెలంగాణలో రైతులందరికీ భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. నిధులు విడుదల చేసేందుకు అంతా రెడీ చేసింది. అయితే రైతు …
Read More »
Kadam
January 8, 2025 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
159
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటికే ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా, ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ ఎలా పనిచేయబోతున్నాయి …
Read More »
Kadam
January 8, 2025 ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్
164
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల హిందీ సిలబస్ మారనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల హిందీ సిలబస్ ను మార్చి గతంలో రద్దు చేసిన రాష్ట్ర సిలబస్ని తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ తరగతుల్లో NCERT సిలబస్ అమలు చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు తరగతుల సిలబస్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య …
Read More »
Kadam
January 8, 2025 ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్, తెలంగాణ
135
2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 18, ఏప్రిల్ 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్షకు సంబంధించిన పరీక్ష మాత్రం జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తవగా అడ్మిట్ కార్డులు సైతం విడుదలయాయి. విద్యార్ధుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేదీ …
Read More »
amaravatinews
January 7, 2025 సినిమా
144
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించాడు. మంగళవారం ఉదయం పూట కిమ్స్ హాస్పిటల్కు బన్నీ వెళ్లాడు. బన్నీతో పాటుగా దిల్ రాజు కూడా హాస్పిటల్కు వెళ్లాడు. శ్రీతేజ్తో పాటుగా రేవతి భర్తను కూడా బన్నీ పరామర్శించాడు. ఈ మేరకు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి, పర్మిషన్ తీసుకుని బన్నీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. గత నెలలో సంధ్య థియేటర్ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్కు బన్నీ వెళ్లడం, అక్కడ …
Read More »
amaravatinews
January 6, 2025 ఆంధ్రప్రదేశ్
187
నిత్యం లక్షలాదిమంది జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు మాత్రం హడావిడిలో డబ్బులు, బంగారం వంటి వాటిని అక్కడే వదిలేసి బస్సును దిగిపోతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు వాటిని గుర్తించి జాగ్రత్త చేస్తున్నారు.. ఉన్నతాధికారులతో కలిసి తిరిగి వాటిని పోగొట్టుకున్నవారికి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ నెల 4వ తేదీన …
Read More »
amaravatinews
January 3, 2025 తెలంగాణ
189
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సంచలన ఛాలెంజ్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని ఆరోపించిన కవిత.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే …
Read More »
amaravatinews
January 3, 2025 ఆంధ్రప్రదేశ్
205
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. టీడీపీ కూటమి సర్కారు చర్యల కారణంగా.. పలు కీలక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం కనిగిరిలో 4000 ఎకరాల బంజరు భూమిని రిలయన్స్ ఇండస్ట్రీస్కు లీజుకు ఇవ్వనున్నారు. గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమికి ఎకరాకు ఏడాదికి 15 వేలు …
Read More »