Recent Posts

అందరి చూపు సెప్టెంబర్ 17వైపే.. ఓవైపు నిమజ్జనం, మరోవైపు విమోచనం.. సర్వత్రా ఉత్కంఠ..!

ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే ఉంది. ఆరోజు హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు.. సెప్టెంబర్ 17వ తేదీనే హైదరాబాద్‌లో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. కాగా.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉండటంతో.. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరుగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. …

Read More »

ఎఫ్‌డీ చేసే వారికి బెస్ట్ ఆప్షన్.. ఈ బ్యాంకుల్లో 9 శాతం వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు …

Read More »

రాజమండ్రిలో చిక్కని చిరుత.. భయం గుప్పిట్లో శివారు ప్రాంతాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత కనిపించి 9 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ దానిని అటవీశాఖ బంధించలేకపోతోంది. దీంతో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాలైన దివాన్ చెరువు, లాలా చెరువు, స్వరూప్ నగర్, తారక నగర్, శ్రీరాంపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »