Recent Posts

అనంతపురం: రాముడి రథానికి నిప్పు.. చంద్రబాబు సీరియస్, రంగంలోకి స్పెషల్ టీమ్స్

అనంతపురం జిల్లాలో రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకలంరేపింది. కనేకల్ మండలం హనకనహాల్‌లో రామాలయం ఉంది.. అక్కడ మంగళవారం అర్ధరాత్రి రాముడి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. పుణ్యతిథులు, ఉత్సవాల సమయంలో రాములవారిని రథంపై ఊరేగిస్తుంటారు. మిగతా సమయంలో ఓ షెడ్డులో రథాన్ని భద్రపరుస్తారు. రథానికి నిప్పు పెట్టారనే సమాచారం అందుకున్న కళ్యాణదుర్గ డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రిమినల్ …

Read More »

అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు వరం.. రూ.50 లక్షల ఖరీదైన వైద్యం నిమ్స్‌లో ఉచితం

అరుదైన జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వరం లాంటి వార్త. అలాంటి చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్‌లో 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పాలసీ ఫర్‌ రేర్‌ డిసీజ్‌ (NPRD) పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో అమలు చేస్తున్నారు. జెనెటిక్‌, అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులు, డాక్టర్లను ఏర్పాటు చేశారు. చిన్నారులు గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే కోలుకోవటం కష్టం. వారికి జీవితాంతం ఖరీదైన …

Read More »

20 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ.. మాజీ ఎంపీకి బంపరాఫర్, కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది.. మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో.. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్ద పీట వేశారు.. 11 మంది కస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఆరుగురు యూనిట్‌ ఇన్‌చార్జ్‌లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌కు ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. …

Read More »