Tag Archives: Telangana

‘రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే’.. హరీష్ టార్గెట్‌గా ఫ్లెక్సీలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట కొందరు ఈఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీశ్ రావు రాజీనామాకు వారు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు …

Read More »

బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …

Read More »

అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ …

Read More »

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …

Read More »

రైతులకు మరో శుభవార్త.. ఖాతాల్లోకి ఒకేసారి 15 వేలు.. ముహూర్తం అప్పుడే..!?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తోంది. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్.. ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ …

Read More »

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల …

Read More »

చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …

Read More »

సీఎం రేవంత్ దక్షిణ కొరియా టూర్ రద్దు, 2 రోజుల ముందే ఇండియాకు.. క్లారిటీ ఇదే..!?

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 3వ తేదీన మొదలైన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఆగస్టు 14 వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా.. మొదట అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం లభించింది. మొదటి రోజు నుంచే రేవంత్ టీం.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. పెద్ద …

Read More »

నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం

తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 63వ నెంబర్‌ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌ నుంచి …

Read More »

నేడే తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. 

తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో.. శుక్రవారం (ఆగస్టు 2) అసెంబ్లీ (TG Assembly)లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని రెండు రోజుల క్రితలం మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించిన …

Read More »