తిరుపతి

మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ

టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగ‌ర్భం జ‌లాశ‌యం స‌మీపంలోని కాకుల‌మాను దిబ్బ వ‌ద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత ప‌రిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక …

Read More »

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …

Read More »

TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …

Read More »

తిరుమల శ్రీవారికి బెంగళూరు, హైదరాబాద్ భక్తుల భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం, ఎంతంటే!

తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలను అందించారు. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత నగేష్ స్వయంగా డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు ఎలక్ట్రిక్ బైకుల్ని కానుకగా అందజేశారు. హైదరాబాద్ పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీ వెంకట నాగరాజ 15 …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 17న (ఆదివారం)న తిరుమలలో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు. శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. జనవరి నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్టే!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు ఎక్కడికెక్కడి నుంచో తరలివస్తుంటారు. సుదూరం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి.. ఆ దేవదేవుడి దర్శనం కోసం వస్తుంటారు. అలా వచ్చే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాత్రికుల వసతి, భోజనం, దర్శనం విషయాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తోంది. శ్రీవారి దర్శనానికి రోజురోజుకూ యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి భక్తుల వసతి కోసం నూతన సముదాయాన్ని టీటీడీ నిర్మిస్తోంది. …

Read More »

తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్.. రంగంలోకి సీబీఐ సిట్, టీమ్‌లో నలుగురు సభ్యుల వివరాలివే

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై బిగ్ అప్డేట్ వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ ప్రారంభించింది. ఈ సిట్‌లో‌ సభ్యులుగా సీబీఐ నుంచి ఎస్వీ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జాయింట్ డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ)లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి (డీఐజీ, విశాఖపట్నం రేంజ్)లను సిట్ సభ్యులుగా నియమించింది. అయితే ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ.ఐ నుంచి సభ్యుడిని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ …

Read More »

తిరుమలలో అంబటి రాంబాబు షర్ట్‌పై వివాదం.. టీటీడీకి ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ రమేష్

మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో తిరుమలకు రావడం చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీల చిహ్నాలు, జెండాలు, స్టిక్కర్లతో శ్రీవారి దర్శనానికి రాకూడదు. అయినా అంబటి రాంబాబు తన చొక్కాపై జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో వచ్చారు.. నిబంధనలకు విరుద్ధంగా ఆయన అలా రావడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే అంబటి రాంబాబు తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »