ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ను కాలేజీల బ్యాంకు అకౌంట్లకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.‘చాలామంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశాలపై నన్ను ట్యాగ్ చేసి స్పందించమని అడిగారు. విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను నేను నోట్ చేసుకున్నాను. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం. అలాగే సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాల జారీలో విద్యార్థుల సమస్యలు …
Read More »Tag Archives: andhra pradesh
ఏపీలో కొత్త పింఛన్ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు ఇస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది …
Read More »ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.35వేల నుంచి రూ.లక్షకు పెంపు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గృహనిర్మాణంపై సమీక్ష చేసిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై వివరించారు. డిసెంబరులో పీఎంఏవై 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేలా కేంద్ర …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు తీపికబురు.. డిసెంబర్లో పక్కా, ఇకపై సరికొత్తగా!
ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం మెనూ మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమలు చేస్తుండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మోనూ సిద్ధం చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై మూడు నుంచి నాలుగు రకాల మెనూలు అమలు చేయాలని భావిస్తున్నారు.. వాస్తవానికి జిల్లాకో మెనూ అమలు చేయాలని అనుకున్నారు.. కానీ కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్కు ఒక మెనూ ఉండాలని నిర్ణయించారు. మంగళగిరిలో డొక్కా సీతమ్మ …
Read More »ఏపీలో ప్రభుత్వానికి మరో బ్యాంక్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి సహకార బ్యాంకు (ఆప్కాబ్) ఉద్యోగులు రూ.1.16 కోట్ల విరాళాన్ని అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సహకార శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్బాబు, బ్యాంకు ఎండీ డా.ఆర్.ఎస్.రెడ్డి, సీజీఎంలు ఎన్.వెంకటరత్నం, రామచంద్రయ్య, ఉద్యోగులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాయచోటి నియోజకవర్గ వ్యాపారులు, వర్తక సంఘాల తరఫున రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మరోవైపు ఏపీలో …
Read More »ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త.. డిసెంబర్ నుంచి పక్కా, రూ.12వేలు తీసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హామీని నిలబెట్టుకుంటున్నారు. ఈ మేరకు పింఛన్కు సంబంధించిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. వరుసగా రెండు నెలలు తీసుకోలేకపోతే.. ఆ తర్వాత నెలలో మూడు నెలలకు కలిపి మొత్తం (రూ.12వేలు) అందిస్తారు. ఈ హామీ అమలుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి …
Read More »ఉచిత సిలిండర్కు ఆ రెండూ తప్పనిసరి.. లేకుంటే పథకం కట్: విధివిధానాలు ఇవే
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళి రోజున ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్న విషయం తెలిసిందే. దీంతో ‘దీపం 2.0’ కింద బుకింగ్స్ మొదలు కాగా.. అక్టోబరు 31 నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. అయితే, ఈ పథకానికి తాము అర్హులమా? కాదా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే ఉచిత గ్యాస్కు అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. దీనికి గల …
Read More »ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టడం ఏంటి?.. చాలామంది ఎగిరిపోతారు..
ఓ వ్యక్తి విలాసాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు..సీఎం చంద్రబాబు. జగన్ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను..ముఖ్యమంత్రి పరిశీలించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చని జగన్ ప్రభుత్వం..ప్యాలెస్ కోసం 430 కోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. ప్రజల నుండి వచ్చే సూచనల మేరకే రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రుషికొండ భవనాల నిర్మాణం ముమ్మాటికీ నేరమే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. భవన నిర్మాణాల తీరు.. నిబంధనల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో …
Read More »వైసీపీ మాజీ ఎంపీ మాధవ్ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్ బయటకు చెబుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్బాబును ఫిర్యాదులో కోరారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమన్నారు. అందుకే మాధవ్పై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. ఏదైనా ఒక ఘటన జరిగిన సమయంలో అత్యాచారాలకు గురైన వారి వివరాలు …
Read More »ఏపీలో వారందరికి బిగ్ అలర్ట్.. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తారు, మరో రూ.2లక్షలు కూడా.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతి వృత్తిదారులకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తిస్తుంది. 2023-24 ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హుల్ని గుర్తించారు. రెండో విడత జాబితాలో దరఖాస్తులకు సంబంధించి సర్వే చేయాల్సి ఉంది. కొన్ని అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. ఈ మేరకు , సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, నోడల్ అధికారులు, మెప్మా కమ్యూనిటీ అర్గనైజర్ల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »