ఏపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సరస్వతీ ఘాట్లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అన్నవరం సత్యనారాయణస్వామి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామిలను దర్శించుకుంటారు. చివర్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో గోదావరి …
Read More »సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయేల్ భీరక దాడులు
ఇజ్రాయేల్ అనుకున్నంత పనిచేసింది. ఈ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్పై ఇజ్రాయేల్ దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 1న ఇజ్రాయేల్పై 200కిపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను …
Read More »ఏపీలో టీచర్లకు తీపికబురు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, డిసెంబర్లో ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతోంది. ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. టీచర్లు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీవిరమణ వరకు మారుమూల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేలా చట్టాన్ని తీసుకొస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు ఉన్న ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ బదిలీలకు గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు కాగా.. కనీస సర్వీసు ఎంతనేది మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ప్రమోషన్లు ఇచ్చి, ఆ తర్వాత …
Read More »విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్లోనే!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ …
Read More »ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త.. వచ్చే నెలలోనే, మంత్రి కీలక ప్రకటన
ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో కందిపప్పు కేజీ ధర రూ. 180 నుంచి రూ. 160కి, ఆ తర్వాత రూ. 150కి తగ్గించే విధంగా వర్తకులతో మాట్లాడామని చెప్పారు. రాష్ట్రంలో రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పు రూ. 67కే అందుబాటులోకి వచ్చిందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చొరవతో పామాయిల్ ధర రూ. 110కు తగ్గింది అన్నారు. అంతేకాదు 2,300 …
Read More »షర్మిల లాంటి చెల్లెలు ఏ కొంపలో ఉండకూడదు.. మా దరిద్రానికి తోడైంది.. వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ముదురుతున్నాయి. వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకూ ఇరువురు నేతల మధ్య విమర్శలకు దారితీస్తోంది. ఇదే క్రమంలోనే వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ తన సొంత ఆస్తిలో.. చెల్లెలుకు వాటా ఇవ్వాలనుకున్నారని, కానీ షర్మిల మాత్రం వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ …
Read More »Narendra Modi: దీపావళికి స్పెషల్గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?
Narendra Modi: తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం …
Read More »తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!
తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి …
Read More »AP Deepam Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్కోండి మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS (మెసేజ్) వెళుతుందని చెప్పారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందని.. సిలిండర్ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు …
Read More »Ratan Tata Will: టాటా గొప్ప మనసు.. తన రూ. 10 వేల కోట్ల ఆస్తిలో బట్లర్ సుబ్బయ్య, కుక్ రాజన్ సహా కుక్కకు కూడా వాటా..!
Ratan Tata Networth: మార్కెట్ విలువ పరంగా భారత్లో టాటా గ్రూప్ అతిపెద్దది. దీని మార్కెట్ విలువ రూ. 30 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. పలు దేశాల జీడీపీ కంటే కూడా దీని విలువే ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే టాటా గ్రూప్ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో టాటా సన్స్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా పాత్ర కీలకం. దశాబ్దాల పాటు సంస్థకు నేతృత్వం వహించి సంస్థను విస్తరించారు. ఆయన నేతృత్వంలో దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించి.. ఎందరికో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal