Recent Posts

మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ దళ విజయానికి అసలు కారణం ఇదే!

26 ఏళ్ల తరువాత ఢిల్లీకి రాజా అనిపించుకుంది భారతీయ జనతా పార్టీ. దేశ రాజధానిలో ఊరిస్తున్న విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు కమలనాథులు. కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. విజయమే లక్ష్యంగా ఢిల్లీ గల్లీల్లో దూసుకుపోయారు.మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా… దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ …

Read More »

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ సంచలనం.. ఆప్ అధినేత కేజ్రివాల్ ఓటమి

ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌‌పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత..  సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్‌ బస్తీ స్థానంలో ఓడిపోయారు.  ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర …

Read More »