amaravatinews

కేంద్రం నిర్ణయంతో విజయవాడకు మహర్దశ.. అక్కడే ఫిక్స్, త్వరలోనే!

కేంద్రం విజయవాడకు సంబంధించిన పలు రైలు, హైవే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడకు తూర్పు బైపాస్ కూడా వచ్చింది. అయితే కేంద్రం ఓ షరతు విధించింది. లాజిస్టిక్‌ హబ్‌ కోసం తమకు 100 ఎకరాలు భూసేకరణ చేసి కేటాయించాలని కోరింది. ఈ క్రమంలో కొండపల్లిలో హబ్ ఏర్పాటుకు అడుగులుపడుతున్నాయి. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. …

Read More »

హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ రియాక్షన్ ఇదే..

తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన విజయ్.. ఆదివారం టీవీకే మహానాడును నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు అశేష జనవాహిణి హాజరైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను విజయ్ వెల్లడించారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో …

Read More »

Stock Market: ఒక్క రోజే రూ.6 లక్షల కోట్లొచ్చాయ్.. భారీ లాభాల్లో సూచీలు.. కారణాలు ఇవే!

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా కొన్ని రోజులుగా వరుసగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీలు రాణిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లకుపైగా పెరిగింది. దీంతో …

Read More »

అదరగొట్టిన డిఫెన్స్ స్టాక్.. 4 ఏళ్లలోనే చేతికి రూ.10 లక్షలు.. మరింత పెరిగే ఛాన్స్!

Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరి డిఫెన్స్ సెక్టార్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (Apollo Micro Systems Ltd) స్టాక్ అదరగొట్టింది. గత రెండేళ్లలో తమ షేర్ హోల్డర్లకు హైరిటర్న్స్ అందించింది. 2 ఏళ్లలోనే ఏకంగా 386 శాతం లాభాలు అందించింది. అలాగే గత నాలుగేళ్లలో చూసుకుంటే లక్ష రూపాయల పెట్టుబడిని 920 శాతం లాభంతో రూ.10 లక్షలకుపైగా చేసి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. మరి అపోలో మైక్రో సిస్టమ్స్ …

Read More »

తుని ఆర్టీసీ డ్రైవర్‌కు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్.. మరో బంపరాఫర్ ఇచ్చారు

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ …

Read More »

తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. 10 మంది TGSP పోలీసులు డిస్మిస్

తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన …

Read More »

రాజమహేంద్రవరంవాసులకు సూపర్ న్యూస్.. గోదావరి నదిలో విహరిస్తూ రెస్టారెంట్‌లో ఫుడ్ తీనొచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజమహేంద్రవరం వాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గోదావరిపై బోటుపై విహరిస్తూ.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఈ అనుభూతిని ప్రజలకు అందించేందుకు సరికొత్తగా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక దగ్గర ఈ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. పర్యాటకులు, స్థానికులు రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్‌ సమీపంలోని …

Read More »

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌కు ఫుల్ డిమాండ్.. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎన్నేళ్లు కట్టాలి?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఒకటి. ఇక్కడ నిర్ణీత కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీకి మంచి లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా అన్ని వర్గాల వారి కోసం.. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, రిటైర్మెంట్ స్కీమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఆడపిల్లల కోసమైతే సుకన్య సమృద్ధి యోజన, మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, రిటైర్మెంట్ ఫండ్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్, నెలనెలా పింఛన్ అందుకునేందుకు ఇది పనిచేయడం సహా …

Read More »

తీవ్ర జనాభా సంక్షోభంలో చైనా.. వేలాది స్కూల్స్ మూసివేత

ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్‌ గార్టెన్లు (Kindergartens) మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో …

Read More »

అన్న క్యాంటీన్ల కోసం పెద్ద మనసుతో.. వారికి బంపరాఫర్, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించబోతున్నారు. దీని కోసం అన్న క్యాంటీన్‌ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »